Wednesday, 19 November 2025 05:52:51 PM
# *ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్..* # *గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాలను ఆకస్మిక తనిఖీ- జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్...* # *ఏసీబీకి చిక్కిన సర్వేయర్..* # *శబరిమలకు పోటెత్తిన భక్తులు కి.మీ మేర క్యూ* # *ఏసీబీకి చిక్కిన ఎస్సై.. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న ప్రజలు..* # *40,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో రూ.20,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన టిజిఎస్‌పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ & డివిజన్‌లోని గోపాల్ # * *హిజ్రాలలో వర్గ పోరుఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రా* # * *హైదరాబాద్ లో పెరుగుతున్న విడాకుల కేసులు!* # * *మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతం* # *రాబోవు రెండు రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం, తగు జాగ్రత్తలు తీసుకోవాలి : నివాస్ న్యూస్ చానెల్ చైర్మెన్ డా.ప్రకాశ్ జాదవ్..* # * ములుగు జిల్లాలు ఘనంగాకార్తీక మహోత్సవం కార్యక్రమం # *ఏసీబీ చిక్కిన సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్..* # *అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం..* # *_రోజుకు మినిమమ్ రూ. 3 నుంచి 5 లక్షలు..! సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి దందా.. ఏసీబీ దాడుల్లో వెలుగులోకి_* # Every letter a journalist writes becomes a shield of truth # కలం కదిలితే—సమాజం కల్లోలమే # *మరోసారి మానవత్వం చాటుకున్న ప్రకాష్ మిత్రబృందం* # *కవితా శీర్షిక:"నిప్పురవ్వ" డాక్టర్ ప్రకాష్ జాదవ్ నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ ..* # * *ఇమ్మడి రవితోనే ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లను క్లోజ్ చేయించిన పోలీసులు* # *తెలంగాణలో మరో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు?*

తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు

Date : 02 January 2025 08:09 PM Views : 2700

Nivas News - తెలంగాణ / హైదరాబాద్ : *తెలంగాణలో పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు* హైదరాబాద్ నివాస్ న్యూస్ జనవరి 2 ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ శాఖ గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు.. పలు ఇబ్బందులు జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు. తీరనున్న 48 వేల మంది కష్టాలు హైదరాబాద్ : రాష్ట్రంలోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇక నుంచి నెలనెలా జీతాలు వారి అకౌంట్లోనే పడనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల బ్యాంకు ఖాతా వివరాలు సేకరించింది. ఈ నెల నుంచే వారి జీతాలను అకౌంట్లలో జమచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గతంలో వీరికి గ్రామ పంచాయతీల నుంచి జీతాలు ఇచ్చేవారు. దీనివల్ల సమస్యలు తలెత్తేవి. పంచాయతీ కార్యదర్శులు సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వారి కుటుంబాలను పోషించడం కష్టంగా మారేది. ఇప్పుడు నేరుగా అకౌంట్లోనే డబ్బులు జమకానుండడంతో పారిశుధ్య కార్మికులు ఏండ్లుగా ఎదుర్కొన్న సమస్య పరిష్కారం కానున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల వివరాలను పంచాయతీరాజ్ శాఖ సేకరించినట్టు తెలిసింది. వాటిని ఈ- పంచాయత్ వెబ్సైట్లో నమోదు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో 32 జిల్లా పరిషత్లు, 620 మండల పరిషత్లు, 12,769 గ్రామ పంచాయతీల్లో 48 వేల పైచిలుకు మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘకాలికంగా సేవలందిస్తున్నప్పటికీ వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేవు. దీంతో సేవలకు సంబంధించి సీఎం, మంత్రుల సమీక్షల సందర్భంగా స్పష్టమైన సమాచారాన్ని ఉన్నతాధికారులు ఇవ్వలేక పోతున్నారు. జీతాలు సరిగా ఇవ్వడం లేదని, పనిభారం ఎక్కువగా ఉందని కొందరు కార్మికులు వెళ్లిపోతుండగా.. వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవడం లేదు. సరైన సంఖ్య తేలక ఏటా జీతాల చెల్లింపులకు బడ్జెట్ కేటాయింపులు సరిగా జరగడం లేదు. ఒక్కోసారి 3 నెలలపాటు జీతాలు అందట్లేదు. ఈ సమస్యల నేపథ్యంలో వారందరి వివరాలు పక్కాగా నమోదు చేయాలని పంచాయతీరాజ్శాఖ నిర్ణయించింది.

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2025. All right Reserved.



Developed By :