Nivas News - తెలంగాణ / ఖమ్మం : *శ్రీ చైతన్య పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు.* స్థానిక ముస్తఫా నగర్ శ్రీ చైతన్య లోటస్ బ్రాంచ్ నందు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని,పాఠశాలలో మామిడి తోరణాలతో అలంకరించి ముగ్గుల పోటీలను నిర్వహించి గొబ్బెమ్మలను ఏర్పాటు చేశారు. పరమాన్నాన్ని తయారు చేసి,భోగిమంటలను నిర్వహించారు. బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు . విద్యార్థుల తలపై నుండి భోగిపళ్ళను పోసి విద్యార్థులకు సకల శుభాలు చేకూరాలని దీవించారు. తదనంతరం పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి గారు మాట్లాడుతూ దేవతలు ఉత్తరాయనములోకి ప్రవేశించిన సందర్భంగా, ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన సందర్భంగ అన్ని శుభదినాలు చేకూరుతాయని, శ్రీమహావిష్ణువు రాక్షసులను సంహరించి శుభాలు చేకూర్చిన రోజని, రైతులు పంట చేతికొచ్చి సకల భోగభాగ్యాలతో వెలసిల్లుతూ దానధర్మాలు చేస్తారని, గాలిపటాలు ఆకాశంలో ఎగరవేసి దేవతలకు స్వాగతం పలుకుతారని, హరిదాసులు గంగిరెద్దులతో ఎంతో శోభాయమానంగా సంక్రాంతి జరుపుకుంటారని, ప్రజలందరూ ఆనందంతో గడపాలని అందరికీ శుభాలు చేకూరాలని వివరించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చైతన్య డైరెక్టర్ శ్రీవిద్య గారు, చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ గారు, డీజీఎం చేతన్ మాధుర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి గారు, డీన్ ప్రవీణ్,పీపీటీ ఇంచార్జీ తన్వీర్, ప్రైమరీ ఇంచార్జీ వినీత,ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.
Admin
Nivas News