Thursday, 15 January 2026 07:31:07 AM
# ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యలను తీసుకురావాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు మీ డాక్టర్ ప్రకాష్ జాదవ్ నివాస్ న్యూస్ ఛానల్ చైర్మన్ # ఘంటారావం పత్రికకు ఏఐజెపిఎఫ్ సంఘీభావం ప్రకటన # *హైదరాబాద్‌లో మరో దారుణ హత్య* # *నేడు CBI ముందుకు TVK చీఫ్ విజయ్...* # *మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత...* # తల్లి దీవెనలతో ధర్మపోరాటానికి సంసిద్ధం # *ఆంజనేయ స్వామి విగ్రహం కింద గుప్త నిధుల అన్వేషణ...* # *వైభవంగా జరిగిన కూడారై ఉత్సవం* # *ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్‌ లో వెలుగు చూసింది.* # *ఇంటి జాగా లేని వారందరికీ ఇళ్ల స్థలాలు అందించే బాధ్యత నాది....* # శ్రీ చైతన్య పాఠశాలలో సంక్రాంతి సంబరాలు # *ఎస్ఆర్ డీ.జీ. స్కూల్లో సంక్రాంతి సంబరాలు* # శ్రీ చైతన్య పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబురాలు # *యువత చూపు బీజేపీ వైపు : జ్వాలా నర్సింహారావు...* # *చిన్నపిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్...* # *ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ (AIBSS )రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రంజిత్ నాయక్...* # * *తీవ్ర వాయుగుండం ముప్పుపెరగనున్న చలి తీవ్రత* # * *ప్రాణాలూ పోతున్నా బిజినెస్సే* *రూ.1.2 కోట్ల విలువ చేసే చైనా మాంజా పట్టివేత* # * *భూభారతి లో ‘ఎడిట్'తో నిలువు దోపిడీ..!* # * *పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు యూట్యూబర్‌ అరెస్టు*

*ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్‌ లో వెలుగు చూసింది.*

Date : 11 January 2026 07:28 AM Views : 131

Nivas News - తెలంగాణ / ఖమ్మం : *ప్రమీల అనే వివాహిత మహిళను కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన గటన ఖమ్మనం నగరంలోని బ్రాహ్మణ బజార్‌ లో వెలుగు చూసింది.* మోడెం ప్రమీల అనే వివాహిత కస్బాబజార్ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తుంది. అయితే ఇటీవల ఆమె పని ముగించుకుని రూమ్‌కి వెళ్లే క్రమంలో జీవీ మాల్ వద్ద ఆమెపై దాడి చేసిన వ్యక్తులు కత్తులతో అతి కిరాతకంగా పొడిచి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చెందిన బి. నరసింహా రావు అనే RMP డాక్టర్, ప్రమీల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో వీరు విడిపోయి వేరువేరుగా ఉంటున్నారు. అయితే వీరు విడిపోవడానికి ముందు పాల్వంచలోని శ్రావణ్‌ అనే వ్యక్తి ఇంట్లో రెంట్‌కు ఉన్నారు. ఆ సమయంలో వీరితో శ్రావణ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రమీల మధ్య వర్తిగా ఉండి శ్రవణ్‌కు డబ్బులు ఇప్పించింది. అయితే అవి తిరిగివ్వాలని ప్రమీల అడగ్గా.. నువ్వా నాతో ఉంటేనే ఇచ్చిన డబ్బులు తిరిగి ఇస్తానని శ్రవణ్ ఆమెను గత కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని.. ఆమె భర్త ఆరోపించాడు. ఈ విషయంపై ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. అయితే ఆ శ్రవణే తన భార్యను హత్య చేసి ఉంటాని భర్త నరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరా దృశ్యాల అధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

Nivas News

Admin

Nivas News

మరిన్ని వార్తలు

Copyright © Nivas News 2026. All right Reserved.



Developed By :